ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరుగనుంది. ఈ క్రమంలో తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తనకు సమాచారం ఉన్నట్టు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కౌంటింగ్లో ఇలాంటి వారి పట్ల ఎన్డీఏ కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంతతకు నెలవు తెనాలి ప్రాంతమని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉందామని అన్నారు.