అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న జరిగిన ముంబై, గుజరాత్ మ్యాచ్లో ఘర్షణ జరిగింది. ఈ మ్యాచ్ మధ్యలో రోహిత్, హార్దిక్ పాండ్యా అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆటగాళ్లపై అభిమానం ఉండాలి గాని.. ఇతరులను గాయపరిచేలా ఉండొద్దని కామెంట్లు చేస్తున్నారు.