కళియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వెంకటేశ్వరుడి దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది.