15 మందికి కరెంట్ షాక్ (VIDEO)

54చూసినవారు
యూపీలోని లఖింపూర్ ఖేరీలో గురువారం విషాద ఘటన జరిగింది. మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు అమీన్‌నగర్‌లో 50 అడుగుల తాజియాతో ఊరేగింపుగా వెళ్లారు. అయితే ఆ తాజియా హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తాకింది. దీంతో తాజియాకు మంటలు అంటుకున్నాయి. దానిని పట్టుకున్న 15 మందికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను షాజహాన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్