19న సీడబ్ల్యూసీ భేటీ.. ఐదు న్యాయాల పేరుతో మేనిఫెస్టో

66చూసినవారు
19న సీడబ్ల్యూసీ భేటీ.. ఐదు న్యాయాల పేరుతో మేనిఫెస్టో
ఢిల్లీలో రేపు ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీకానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువన్యాయ్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేయనున్నారు. రెండు జాబితాల్లో 82 మంది పేర్లను ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్