బీజేపీ పాలిత గుజరాత్లో దళితులపై దాడులు ఆగడంలేదు. తలపాగా ధరించి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోను తన ఇన్స్టాలో షేర్ చేశాడన్న ఆగ్రహంతో దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల వ్యక్తులు చావబాదారు. సబర్కాంత జిల్లా సయేబాపూర్లో ఘటన చోటుచేసుకుంది. అజయ్పర్మార్ (24) అనే దళిత యువకుడిని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. దీంతో నలుగురిపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.