బహుజన్ సమాజ్వాదీ (BSP) సస్పెండెడ్ ఎంపీ డేనిష్ అలీ
కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలీకి ఏఐసీసీ నాయకుడు అవినాష్ పాండే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇదే అమోహ్రా నుంచి ఆయన
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.