ఆస్తి కోసం ఓ కోడలు కిరాతకంగా వ్యవహరించింది. సొంత మామను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన పురుషోత్తం పుట్టేవార్(82) గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే అనుమానం వచ్చి కేసును లోతుగా దర్యాప్తు చేయగా ఆస్తి కోసం ఆయన కోడలు అర్చనా మనీశ హత్య చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అర్చన, తన భర్త మనీశ్ కారు నడిపే డ్రైవర్ సహకారంతో మామను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.