ఐసీయూలో ఉన్న తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తెలు(వీడియో )

71చూసినవారు
అనారోగ్యంతో ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను ఇద్దరు కుమార్తెలు నెరవేర్చారు. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల జునైద్ మియాన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో లక్నోలోని ఓ హాస్పిటల్‌ ఐసీయూలో చేర్పించారు. కాగా, జునైద్ మియాన్‌ ఇద్దరు కుమార్తెలకు ఇటీవల పెళ్లి సంబంధాలు కుదిరాయి. ఈ క్రమంలో జునైద్‌ ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు వరులు కలిసి ఆయన కళ్ల ముందే ఐసీయు వార్డులో పెళ్లి చేసుకొని ఆయన కోరిక నెరవేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్