వైసీపీ అధినేత జగన్కు సంబంధించి హైదరాబాద్లోని నివాసం వద్ద అక్రమంగా నిర్మించిన షెడ్లను శనివారం కూల్చిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతపై జీహెచ్ఎంసీ అధికారులు ఫైర్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.