ముంబైలోని ఓ మహిళకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. 'బర్గర్ కింగ్' అవుట్లెట్కు వెళ్లి, తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ను ఆమె ఆర్డర్ చేసింది. ఆ తర్వాత తాను ఆర్డర్ చేసిన బర్గర్ తింటుండగా అందులో ఆమెకు చచ్చిన పురుగు కనిపించింది. దీంతో తిన్న బర్గర్ను ఆమె వాంతులు చేసుకుంది. ఈ వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'బర్గర్ కింగ్' సంస్థపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.