కులగణన చేపట్టి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆరు నెలలైనా కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు? రేవంత్రెడ్డి సర్కార్ ఓట్లకోసమే అణగారిన వర్గాలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. జూన్ 11లోపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.