రూ 2.30 కోట్ల నోట్ల కట్టలతో గణపయ్యకు అలంకరణ

75చూసినవారు
మంగళగిరి చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ 2.30 కోట్ల నోట్ల కట్టలతో గణపయ్యకు అలంకరణ చేప‌ట్టారు. మంగళగిరి మెయిన్ రోడ్డు వద్ద గత 18 సంవత్సరాల క్రితం రూ.లక్షతో అలంకరణ మొదలుపెట్టిన‌ట్లు ఆశ్య‌వైశ్య నాయ‌కులు సంక బాలాజీ గుప్తా తెలిపారు. అది ఈసారి రూ.2.30 కోట్లకు చేరింది. దేవుని ఆశీస్సులతో ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తామ‌ని బాలాజీ గుప్తా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్