ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హాజరయ్యారు. 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్కు ఈ ఏడాది ఫిబ్రవరి 20న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 5 నెలల వ్యవధిలో రాహుల్ గాంధీ రెండోసారి సుల్తాన్పూర్ కోర్టుకు చేరుకున్నారు.