ఇటీవల కాలంలో క్షణికావేశానికిలోనై ఎంతో విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఓ డిగ్రీ స్టూడెంట్ ప్రాణాలు తీసుకుంది. ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సోని (20) అనే యువతి జనగామలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. మనస్తాపంతో హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంది.