దిల్లీ క్యాపిటల్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను జట్టు యాజమాన్యం కోరినట్లు స్పోర్ట్ స్టార్ తెలిపింది. ఐపీఎల్ చివరి మూడు సీజన్లలో ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ గత నెలలో కోచ్ రికీ పాంటింగ్తో విడిపోయింది. దీంతో ఆ స్థానాన్ని యువరాజ్ తో భర్తీ చేయాలని చూస్తోంది దిల్లీ. కాగా, దీనిపై దిల్లీ క్యాపిటల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.