ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆమె కేజ్రీవాల్ అరెస్టుపై సందేశం ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో భగత్ సింగ్, బీఆర్ అంబేద్కర్ ఫొటోలను తన భర్త ఫొటో మధ్యలో పెట్టారు. దీనిపై భగత్ సింగ్ మునిమనవడు యాదవేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ను ఏ రాజకీయ నాయకుడితో పోల్చవద్దని, సరిచేసుకోవాలన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.