నర్మదా బచావో ఆందోళన్ (NBA) ఉద్యమకారిణి మేధా పాట్కర్ను ఢిల్లీలోని సాకేత్ కోర్టు పరువు నష్టం కేసులో దోషిగా తేల్చింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) చైర్మన్ వీకే సక్సేనా మేధా పాట్కర్పై పరువు నష్టం దావా వేశారు. పాట్కర్, సక్సేనా మధ్య 2000 సంవత్సరం నుంచి చట్టసంబంధ పోరాటం కొనసాగుతూ వస్తున్నది.