సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

85చూసినవారు
సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పిటిషన్‌కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సీబీఐకి తాజాగా నోటీసులిచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించింది. ఈ పిటిషన్‌పై ఏడు రోజుల్లో కౌంటర్‌ వేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ విచారణను జులై 17కు వాయిదా వేసింది. కాగా, గతేడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం​ కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని కేజ్రీవాల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్