నయీం కేసు రీఓపెన్ చేయాలని డిమాండ్

59చూసినవారు
నయీం కేసు రీఓపెన్ చేయాలని డిమాండ్
గ్యాంగ్‌‌స్టర్ నయీం కేసును రీ ఓపెన్ చేయించాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీం పేరిట ఉన్న వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోము అంటున్నారు, అసలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని కాంగ్రెస్ నేతలపై సెటైర్ వేశారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్