ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగార్యాలీలో పాల్గొని ప్రజల గొంతుకను వినిపించామని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమికి తమ సంఘీభావం తెలిపామని, ఎన్నికల ముందు హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసిన తీరును ర్యాలీ వేదికగా ఎండగట్టామని చెప్పారు.