శ్రీశైల మహా క్షేత్రంలో అపచారం జరిగింది. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం (పులిహోర)లో రెండు మాంసపు ఎముకలు కనిపించాయి. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాదంలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి.. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. అధికారుల పర్యవేక్షణ లోపంపై భక్తులు మండిపడుతున్నారు.