ఐదేళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధీ లేదని.. అభివృద్ధి పనులు ఇవాళ్టి నుంచే ప్రారంభిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తామని పేర్కొన్నారు. వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం వస్తుందని వెల్లడించారు.