డెబిట్ కార్డు మార్కెట్లో భారత్కు చెందిన రూపే కార్డులదే 69% వాటా (2023) అని ‘ఫిబెనాచీ ఎక్స్’ సంస్థ వెల్లడించింది. కేంద్రం ప్రోత్సాహంతో రూపేలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫోరెక్స్ కార్డులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. జన్ధన్ ఖాతాలు ఉన్న వారికి రూపే డెబిట్ కార్డులు మంజూరు చేయడం, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునే సదుపాయం ఉండటంతో దీనికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపింది.