యాదాద్రికి పోటెత్తిన భక్తులు

50చూసినవారు
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్‌లో బారులు తీరారు. ధర్మ దర్శనానికి 3 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్