ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఇద్దరూ పోలింగ్ కేంద్రం వెలుపల సెల్ఫీ దిగారు. ఆరో విడత ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ హక్కుల కోసం, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని రాహుల్ గాంధీ కోరారు.