TSRTC కొత్త లోగో ప్రచారం విషయంలో BRS నాయకులు, మద్దతుదారులపై కేసులు నమోదు చేయడం పట్ల మాజీమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. డీజీపీ రవి గుప్తా, సజ్జనార్లకు పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?అని ప్రశ్నించారు. ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్రచారం చేసిన NTV, BIG TV చానెల్స్, వెలుగు దినపత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామన్నారు.