ఆదివారం నుంచి తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 14వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి సుప్రభాత, వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. అలాగే ఈ నెల 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఈ నెల 23నుంచి 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు.