టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ స్ట్రాటజీని పేసర్ మహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. "నేను ఓ సారి ధోనీని రిటైర్మెంట్ గురించి అడిగా. ఒక ఆటగాడు ఎప్పుడు రిటైర్ కావాలి? అని. 'మొదట మీరు ఆటపై విసుగు చెందినప్పుడు. రెండోది.. జట్టు నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నారని తెలిసినప్పుడు' అని సమాధానమిచ్చారు" అంటూ షమీ వివరించారు. కాగా వచ్చే ఐపీఎల్ సీజన్ లో మహీ ఆడకపోవచ్చని తెలుస్తోంది.