ఐపీఎల్ కు స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వీడ్కోలు పలికారు. ఐపీఎల్ టోర్నీలో కార్తిక్ పంజాబ్, ముంబయి, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కోల్కతా, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన సొంత రాష్ట్రానికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మ్యాచ్ ఆడలేకపోవడం బాధపెట్టే అంశమని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సీఎస్కే యాజమాన్యం వేలంలో తీసుకోవాలని చూసినా.. అప్పుడు అందుబాటులో లేకుండా పోయినట్లు గుర్తు చేసుకున్నాడు.