తంగలాన్‌ మూవీ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌

565చూసినవారు
తంగలాన్‌ మూవీ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌
విక్రమ్ నటించిన తంగలాన్‌ మూవీ అప్‌డేట్‌ ను డైరెక్టర్‌ పా.రంజిత్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పా.రంజిత్‌ మూవీ రిలీజ్‌ గురించి మాట్లాడారు. ‘‘సెన్సార్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ ప్రయోగాత్మక లుక్‌లో కనిపించనున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు కీలక పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్