ప్రజలు విన్నవించే సమస్యలను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి క్యాంపు ఆఫీస్ లో ఇవాళ నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి (M) చెరువుమాధారానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో వరి విత్తనాలు వేయగా 60 రోజుల్లోనే కంకులు వచ్చి నష్టపోయామని విన్నవించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీఏఓను మంత్రి ఆదేశించారు.