BRS నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దురాలవాట్లు, భూతగదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను కేటీఆర్, ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగినా, రాజకీయ రంగు పులిమి లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేటీఆరే చెబుతున్నారని అన్నారు.