రివార్డ్స్ పాయింట్ల పేరుతో తమ బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బిఐ) తెలిపింది. ఎపికె ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించదని పేర్కొంది. ఎస్ఎంఎస్, వాట్సాప్లో వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని ఖాతాదారులను హెచ్చరించింది. సైబర్ నేరగాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రివార్డు పాయింట్ల పేరుతో ఎస్బిఐ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.