సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. "సీఎం జగన్ను చంపడానికి కుట్ర జరిగింది. అందులో భాగంగానే రాయితో దాడి జరిగింది. చంపాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీశ్ పదునైన రాయితో దాడి చేశాడు. ఏ2 ప్రోద్బలంతోనే ఏ1 సతీశ్ దాడికి పాల్పడ్డాడు. కాల్ డేటా, సీసీ ఫుటేజీ ఆధారాలతో ఈ నెల 17న నిందితుడిని అరెస్ట్ చేశాం." అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.