ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చునని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా నింపాలన్నారు. ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చునని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసిన వారు ఈ నెల 24 లోగా ప్రింట్ తీసి అందించాలని స్పష్టం చేశారు.