గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. టీఎస్ న్యాబ్తో పాటు SOT, టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ లో ఎప్పటికప్పుడు మత్తు ముఠాల గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక కిరాణా దుకాణంలో సైబరాబాద్ SOT పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పొడిని పాలల్లో కలిపి తాగుతారని ఆ దుకాణం యజమాని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.