ఫిజీ దేశంలో బుధవారం ఉదయం 6.58 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆ దేశంలోని సువాలో భూమి కంపించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.