సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ ఈనెల 24న భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో భూమిని తాకిన భారీ భూ అయస్కాంత తుఫాను ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సౌర తుఫాను భూమిని తాకడంతో భూ అయస్కాంత క్షేత్రం దెబ్బతినిందన్నారు. దీనివల్ల విద్యుత్ గ్రిడ్లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్లలో అంతరాయాలు ఏర్పడ్డాయని ఎన్ఓఏఏ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ పేర్కొంది.