టీడీపీలో సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు ఆందోళనకు దిగుతున్నారు. అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పంపారు.