ఛత్తీస్గఢ్లోని ధామ్తరి జిల్లా రాంసాగర్ పారాలో సోమవారం ఊహించని ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళలు ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఓ పికప్ వాహనం వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి అక్కడే నిలబడి ఉన్న మహిళలు తృటిలో తప్పించుకున్నారు. భయంతో వారు పరుగులు పెట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది.