ఇండోనేషియాను ఆదివారం రాత్రి భూకంపం వణికించింది. ప్రధాన ద్వీపం జావాతో పాటు రాజధాని జకర్తాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. పశ్చిమ జావా ప్రావిన్స్ పెలబుహన్రాటు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు.