టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితా వెల్లడి కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేసే మూడు లోక్సభ స్థానాల్లో అనకాపల్లి కూడా ఉంది. దీనిపై ఆశలు పెట్టుకున్న పారిశ్రామిక వేత్త బైరా దిలీప్ చక్రవర్తి ఇప్పుడు చోడవరంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.