బీజేపీ, కాంగ్రెస్లపై ఈసీ తీవ్ర ఆగ్రహం

62చూసినవారు
బీజేపీ, కాంగ్రెస్లపై ఈసీ తీవ్ర ఆగ్రహం
ఎన్నికల ప్రచారంలో కులం, మతం, భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ, కాంగ్రెస్ పై EC తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసంగాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక నోట్స్ తమ స్టార్ క్యాంపెయినర్లకు సమకూర్చాలని రెండు పార్టీల అధ్యక్షులను ఆదేశించింది. కాంగ్రెస్ రాజ్యాంగంపై, బీజేపీ మతపరమైన ప్రసంగాలను ఆపాలని సూచించింది. దేశాన్ని విభజించే వ్యాఖ్యలను మానుకోవాలని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్