TG: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ అదనపు సీపీ విశ్వప్రసాద్ బుధవారం మీడియాకు వెల్లడించారు. "పల్స్ టీవీ సీఈవో రేవతితో పాటు, పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య ఉద్దేశ పూర్వకంగా సీఎంపై ఈ వ్యాఖ్యలు చేయించినట్లు దర్యాప్తులో గుర్తించాం. పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను ‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్లో ట్రోల్ చేశారు.' అని ఆయన తెలిపారు.