ఎన్నికల కోడ్.. రూ.49 కోట్లు సీజ్

77చూసినవారు
ఎన్నికల కోడ్.. రూ.49 కోట్లు సీజ్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.49 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. ఇందులో రూ.31.12 కోట్ల నగదు, రూ.3.21కోట్ల విలువైన మద్యం, రూ.5.41కోట్ల నార్కొటిక్ డ్రగ్స్, రూ.7.66 కోట్ల విలువైన 16.9కేజీల బంగారం, 36.5కేజీల సిల్వర్, రూ.1.62కోట్ల వస్తువులు ఉన్నాయన్నారు. 6,647 లైసెన్స్ ఉన్న, 8 లైసెన్స్ లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్