ఒకటో తేదీనే వేతనాలు జమకావడాన్ని తన భార్య కూడా నమ్మడం లేదంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ‘ఎక్స్’ వేదికగా గురువారం సీఎం రేవంత్రెడ్డికి ట్వీట్ చేశారు. ఉద్యోగి ట్వీట్ను ఉటంకిస్తూ సీఎం కార్యాలయం ప్రధాన ప్రజా సంబంధాల అధికారి అయోధ్యరెడ్డి గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఒకటో తేదీనే వేతనాలు అందాయి’’ అని అందులో పేర్కొన్నారు.