ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. మీర్తూర్ పీఎస్ పరిధి జప్పెమర్క, కాంకనర్ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో ఆయుధాలు, వైర్లెస్ సెట్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు.