ర్యాగింగ్‌ భూతానికి ఇంజినీరింగ్‌ విద్యార్థి బలి

68చూసినవారు
ర్యాగింగ్‌ భూతానికి ఇంజినీరింగ్‌ విద్యార్థి బలి
ర్యాగింగ్‌ భూతానికి ఇంజినీరింగ్‌ విద్యార్థి బలి అయ్యాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో YSR జిల్లా జీవీ సత్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌(19) ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23న ఇంటికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు చెప్పలేక మనోవేదన చెంది 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి నిన్న మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్