దేశవ్యాప్తంగా వడదెబ్బకు పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుక్రవారం స్పందించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చేపట్టే అభివృద్ధి అవసరం అన్నారు. 'అభివృద్ధి అవసరం. కానీ మనం సాధ్యమైనంతవరకు పర్యావరణాన్ని రక్షించాలి. పర్యావరణానికి హాని కలగకుండా మనల్ని ముందుకు తీసుకెళ్లే అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి' అని ఆమె ట్వీట్ చేశారు.